తారక్‌తో ‘మన్మథుడు’ భామ అన్షు..

తారక్‌తో ‘మన్మథుడు’ భామ అన్షు..

Anshu: ‘అరవింద సమేత’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలు.

ఈ సినిమాకోసం ‘‘అయినను పోయి రావలెను హస్తినకు’’ అనే టైటిల్ ఫిలిం చాంబర్లో రిజిష్టర్ చేయించారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి మీడియా అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

NTR

ముచ్చటగా మూడు సినిమాల్లో కనిపించి నటనకు టాటా చెప్పేసిన ఓ నటి ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందట. ఆ నటి ఎవరో కాదు అన్షు అలియాస్ అన్షు అంబాని.
‘కింగ్’ నాగార్జున ‘మన్మథుడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది అన్షు. పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

Anshu

తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ రెండో సినిమా ‘రాఘవేంద్ర’ లో కనిపించింది. ఈ రెండు సినిమాల్లోనే ఆమె చేసిన క్యారెక్టర్లు చనిపోతాయి. ఆ తర్వాత శివాజి, లయ, భూమిక నటించిన ‘మిస్సమ్మ’ లో అతిథిపాత్రలో మెరిసింది. అప్పటినుండి మాయమైపోయింది.

Anshu

ఇన్నాళ్లకు త్రివిక్రమ్ ఆమెను వెతికి పట్టుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఓ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’, త్రివిక్రమ్.. రానా-పవన్ కళ్యాణ్ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తూ బిజీగా ఉన్నారు.