రండి.. ‘కోటి వృక్షార్చన’ లో పాల్గొందాం.. మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంత బాగా ముందుకు కొనసాగుతుందో తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘కోటి వృక్షార్చన’ పేరుతో కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటేలా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ తమ వంతు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి సపోర్ట్ అందిస్తూ.. అందరూ ఈ కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటాలని కోరుతూ ఓ వీడియోని విడుదల చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి, మొక్కలు నాటుదాం.. మన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం..’’ అని చెప్పారు చిరు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్…
*కోటి వృక్షార్చన లో పాల్గొని మొక్కలు నాటుదాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం అని మెగాస్టార్ చిరంజీవి పిలుపు*@KChiruTweets#MegaStarChiranjeevi @MPsantoshtrs #GreenIndiaChallenge #kotivruksharchana pic.twitter.com/Ru8HsT4yhA
— satish @10tv news (@SatishKottangi) February 15, 2021