మతిస్థిమితం లేని మహిళనూ వదలని కామాంధులు, మూడో బిడ్డకు జన్మనిచ్చిన అభాగ్యురాలు

నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన సమాజం ఆమెలో ఆడతనాన్ని మాత్రమే చూసింది. కొందరు మృగాళ్లు ఆమెను మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అభాగ్యురాలు ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తాజాగా మరోసారి ఆమె కామాంధుల అకృత్యానికి బలైపోయింది. మూడోసారి బిడ్డకు జన్మనిచ్చింది.

మతిస్థిమితం లేని మహిళనూ వదలని కామాంధులు, మూడో బిడ్డకు జన్మనిచ్చిన అభాగ్యురాలు

mentally challenged woman delivers third baby: మృగాళ్లు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి పైశాచికంగా ప్రవరిస్తున్నారు. చివరికి మతిస్థిమితం లేని మహిళలను కూడా వదలడం లేదు. పశువుల్లా ప్రవర్తించి కామవాంఛ తీర్చుకుంటున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన సమాజం ఆమెలో ఆడతనాన్ని మాత్రమే చూసింది. కొందరు మృగాళ్లు ఆమెను మభ్యపెట్టి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అభాగ్యురాలు ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తాజాగా మరోసారి ఆమె కామాంధుల అకృత్యానికి బలైపోయింది. మూడోసారి బిడ్డకు జన్మనిచ్చింది. నారాయణపేట జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

కోస్గి పట్టణానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ ఆదివారం(మార్చి 7,20214) మూడోబిడ్డను ప్రసవించింది. బస్టాండ్‌ దగ్గర పెట్రోల్‌ బంకు వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ప్రభుత్వ డాక్టర్‌ని రప్పించి ప్రసవం చేయించారు. ఆడబిడ్డ పుట్టింది. బిడ్డను కూడా పట్టించుకోకుండా ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పసికందును అంగన్‌వాడీ సిబ్బంది చేరదీసి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శిశుగృహకు అప్పగించారు.

ఇంత జరుగుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిందితులెవరో గుర్తించే ప్రయత్నం చెయ్యడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బాధితురాలిని ఆదుకోనూ లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా మతిస్థిమితం లేని బాధితురాలకి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. కామాంధులు తనపై లైంగిక దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోలేని స్థితిలో ఉన్న ఆమెకు సరైన వైద్యం అందించి మామూలు మనిషిని చేయాలని వేడుకుంటున్నారు. కాగా, గతంలో ఆ అభాగ్యురాలు జన్మనిచ్చిన ఇద్దరు బిడ్డలనూ శిశుగృహ సంరక్షణకు పంపినట్లు అధికారులు తెలిపారు.