ఇండియాలో Micromax నుంచి ప్రీమియం ఫీచర్లతో 3 కొత్త స్మార్ట్ ఫోన్లు!

  • Published By: srihari ,Published On : June 19, 2020 / 02:32 PM IST
ఇండియాలో Micromax నుంచి ప్రీమియం ఫీచర్లతో 3 కొత్త స్మార్ట్ ఫోన్లు!

మైక్రోమాక్స్ ఇండియా నుంచి భారతదేశంలో 3 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి ప్రీమియం ఫీచర్లు, మోడ్రన్ లుక్‌తో రానుందని మోటరోలా కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్ సంస్థ అధికారిక ప్రకటనకు ముందే సోషల్ మీడియా ద్వారా లాంచింగ్ విషయాన్ని వెల్లడించింది. గాల్వన్ లోయలో ఘర్షణ తరువాత చైనా యాంటీ సెంటిమెంట్ మధ్యలో ఈ కొత్త అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. మైక్రోమాక్స్ తన  iOne Noteను అక్టోబర్‌లో దేశంలో తన చివరి స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో రూ. 8,199 ధరతో లిస్ట్ చేసింది.

నివేదికల ప్రకారం.. అన్ని స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే నెల నాటికి మార్కెట్లోకి రానున్నాయి. మొత్తం మూడు ఫోన్‌లను లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. రూ.10,000 ధరల కేటగిరీ కింద లభిస్తుందని గాడ్జెట్స్ 360 రిపోర్టులో పేర్కొంది. మైక్రోమాక్స్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్టు చేసింది. దీనిపై యూజర్లు అడిగిన ప్రశ్నకు బదులుగా “మేము ఇంటర్నల్ గా వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లతో వస్తున్నాం.. అప్పటిరవకూ వేచి ఉండండి’ అంటూ మైక్రోమాక్స్ ట్వీట్ చేసింది.

చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించడానికి కొనసాగుతున్న డిమాండ్‌కు మద్దతుగా మైక్రోమాక్స్ తన ట్వీట్లలో #MadeByIndian, #MadeForIndian హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తోంది. భారతదేశంలో మోడళ్లను తయారు చేస్తున్నారా లేదా చైనా తయారీదారు నుంచి అవుట్ సోర్సింగ్ చేస్తున్నారా అనేది ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు.