MK Stalin : మరోసారి స్టాలిన్‌ను కలవనున్న సీఎం కేసీఆర్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి   కేసీఆర్ మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలవబోతున్నారు.

MK Stalin : మరోసారి స్టాలిన్‌ను కలవనున్న సీఎం కేసీఆర్ ?

Kcr Stalin

MK Stalin :  తెలంగాణ ముఖ్యమంత్రి   కేసీఆర్ మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలవబోతున్నారు. కాగా… ఈ సారి రాజకీయ పరమైన చర్చల  కోసం కాదు. చదరంగం పోటీల కోసం. జూలై 28 నుండి ఆగస్టు 10 వరకు తమిళనాడులోని చెన్నైలో 44 వ ఫైడ్ (FIDE) అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలు జరుగనున్నాయి.

ఈ పోటీలను తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరుకావాల్సిందిగా   తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు.  ఆసందర్భంగా కేసీఆర్ స్టాలిన్ మరోసారి సమావేశం కానున్నారు.  ఈమేరకు సీఎం స్టాలిన్ తన ఆహ్వానాన్ని వారి పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ ద్వారా శుక్రవారం ప్రగతి భవన్‌కు పంపించారు.

ఇది తన వ్యక్తిగత ఆహ్వానంగా భావించి జూలై 28వ తేదీన జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా స్టాలిన్, కెసిఆర్ ను  ఆ లేఖలో   కోరారు. ఈ సందర్భంగా లేఖను అందచేయడానికి ప్రగతి భవన్ కు వచ్చిన ఎంపీ గిరిజానన్ ను సీఎం కేసిఆర్ మర్యాదపూర్వకంగా సన్మానించారు.  జ్జాపికను అందించారు. కాగా 188 దేశాలనుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీలు, భారత దేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక పోటీలని లేఖలో సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.