Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్ వ్యాధి.. నెల రోజుల్లో 13 మంది మృతి

ముంబైలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ వ్యాధి కారణంగా నెల రోజుల్లో 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్ వ్యాధి.. నెల రోజుల్లో 13 మంది మృతి

Measles Cases: ముంబై మహా నగరంలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ అంటువ్యాధి పసిపిల్లల ప్రాణాలు బలిగొంటుంది. నెల రోజుల్లో మీజిల్స్ కారణంగా 13 మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీజిల్స్ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది.

Elon Musk: రోజురోజుకూ తగ్గిపోతున్న ఎలన్ మస్క్ సంపద.. ట్విట్టరే కారణమా?

ఈ ఏడాది ఇప్పటివరకు 233 మీజిల్స్ కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. గత కొన్నేళ్లలో ఈ స్థాయి కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. బుధవారం 30 మంది చిన్నారులు మీజిల్స్ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. ముంబైతోపాటు సమీపంలోని మాలేగావ్, భివండి, థానే, నాసిక్, అకోలా, కల్యాణ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలి సర్వేలో మరిన్ని అనుమానిత కేసులు బయటపడ్డాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా మీజిల్స్ కేసులు ప్రబలుతున్నాయి. మీజిల్స్ వ్యాధి విజృంభించడానికి కారణం ఇటీవలి కాలంలో వ్యాక్సినేషన్ సరిగ్గా జరగకపోవడమే అంటున్నారు అధికారులు.

కోవిడ్ వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించలేదని, దీంతో మీజిల్స్ వ్యాధి పెరుగుతోందంటున్నారు. చిన్నపిల్లల్లో సోకే ఈ వ్యాధిని నియంత్రించడానికి రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తుంటారు. 9-15 నెలల మధ్య వయసున్న చిన్నారులకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై పరిధిలో అర్హత కలిగిన వారిలో 41 శాతం మంది చిన్నారులు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు చెప్పారు. కనీసం 20,000 మందికిపైగా చిన్నారులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందన్నారు.