తొడ మీద సూసైడ్‌ నోట్‌ రాసుకుని..పబ్లిక్‌ టాయిలెట్‌లో మహిళ ఆత్మహత్య

తొడ మీద సూసైడ్‌ నోట్‌ రాసుకుని..పబ్లిక్‌ టాయిలెట్‌లో మహిళ ఆత్మహత్య

Mumbai woman takes own life In public toilet : భార్యను వేధించే భర్తల గురించి చాలానే విన్నాం. కానీ ముంబైకు చెందిన ఓ భర్త మాత్రం శాడిస్టుకు మారుపేరులా తయారై తనను వదిలిపోయిన భార్యకు తరచూ మెసేజులు పెట్టి మరీ వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేని ఆమె పబ్లిక్‌ టాయిలెట్‌లో చున్నీతో ఉరివేసుకుని చనిపోయింది. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. చనిపోతూ చనిపోతూ ఆమె తన భర్త తనను ఎలా వేధించాడో తన తొడమీద రాసుకుని మరీ చనిపోయింది. దీంతో సదరు భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది తెలిసిన సదరు భర్త అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోయాడు.

ముంబైలోని ములంద్‌కు చెందిన భాగ్యశ్రీ నర్లే అనే 29 ఏళ్ల మహికు సతారాకు చెందిన ఓ వ్యక్తితో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. ఈక్రమంలో భాగ్యశ్రీని భర్త తరచూ వేధించేవాడు. దారుణంగా కొట్టేవాడు. అసభ్య పదజాలంతో తిట్టేవాడు. దీంతో ఆమె భర్త హింసలు భరించలేక పుట్టింటికి వచ్చేసింది. తన కూడా తన కొడుకుని తీసుకువెళ్లేందుకు యత్నించగా..భర్త ఒప్పుకోలేదు. తనదగ్గరే ఉంచేసుకున్నాడు. అలా తండ్రి దగ్గరే కొన్ని నెలలుగా తండ్రితో కలిసి ఉంటోంది. అయినా భార్యను వేధించటం మానలేదనతను. మెసేజ్‌ల‌ ద్వారా భాగ్యశ్రీని మానసికంగా వేధించేవాడు. అయినా ఆమె స్పందించకపోవటంతో అతని అహం దెబ్బతింది.

తనకు భయపడటంలేదని అనుకున్నాడు. వేధింపుల స్థాయిని తీవ్రం చేస్తూ..నిన్ను..నీ కుటుంబాన్ని చంపుతానని తరచూ బెదిరించేవాడు. దీంతో తను బ్రతికి ఉన్నన్నాళ్లు ఈ వేధింపులు తప్పవని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె జనవరి 28న పబ్లిక్‌ టాయిలెట్‌లోకి వెళ్లి చున్నీతో అక్కడి పైపుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బయటకు వెళ్లిన భాగ్యశ్రీ గంట దాటినా ఇంటికి రాకపోవటంతో తండ్రీతో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చెంది ఆమె ఫోటో పట్టుకుని వెతకటం మొదలుపెట్టారు. కానీ ఎంతకూ ఆమె ఆచూకీ తెలిలేదు. ఆమె కోసం వెతుకుతుండగాజజపబ్లిక్‌ టాయిలెట్‌ దగ్గర భాగ్యశ్రీని చూశామని స్థానికులు చెప్పటంతో అక్కడికి వెళ్లి చూడగా..టాయిలెట్‌ లోపలినుంచి గడియపెట్టి ఉంది. దీంతో మరింత భయపడిపోయిన తండ్రి తలుపు బద్ధలు కొట్టి చూడగా భాగ్యశ్రీ అక్కడి పైపునకు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది.

పబ్లిక్ టాయిలెట్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో ఆమె తొడపై సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు. భార్య మరణానికి కారణమైన భర్తపై,అతడి కుటుంబంపై సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.