Rajasthan Crime : కొడుకు ఆరోగ్యం కోసం ..12 ఏళ్ల కూతురిని గొంతుకోసి బలి ఇచ్చిన తల్లి

16 ఏళ్ల కొడుకు ఆరోగ్యంగా ఉండాలని..12 ఏళ్ల కూతురిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపింది ఓ తల్లి.

Rajasthan Crime : కొడుకు ఆరోగ్యం కోసం ..12 ఏళ్ల కూతురిని గొంతుకోసి బలి ఇచ్చిన తల్లి

murder in superstition mother killed 12 Years daughter to save life of elder son

Rajasthan crime : కడుపున పుట్టిన ఆడబిడ్డను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి కొడుకుకోసం ఆ బిడ్డ ఉసురితీసింది. రాజస్థాన్ లో ఓ మహిళ తన 16 ఏళ్ల కొడుకు ఆరోగ్యంగా ఉండాలని..12 ఏళ్ల కూతురిని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపింది. కొడుకుకు గుండెకు చిల్లు (హార్ట్ హోల్) ఉంది. దీంతో అతని ఆరోగ్యం బాగుండేది కాదు. పేదరికంతో వైద్యం చేయించే పరిస్థితి లేదు. ఈ దుస్థితికి మూఢనమ్మకం తోడైంది. నీ కొడుకు ఆరోగ్యంగా ఉండాలంటే నీ కూతురిని ‘బలి’ఇవ్వాలని ఎవరో చెప్పారు. ఆ మాటలు నమ్మిన తల్లి కూతురిని అత్యంత దారుణంగా గొంతు కోసం చంపింది. బరాన్‌ జిల్లాలో ఆదివారం (నవంబర్ 6,2022) జరిగిన ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సదరు తల్లిని అరెస్ట్ చేసారు.

బరాన్ జిల్లాలో శివరాజ్ రేఖ దంపతులు నివసిస్తున్నారు. వారికి నికేంద్ర సింగ్, మరో కొడుకు,ఓకూతురు ఉన్నారు. నిరేంద్ర సింగ్ కు 16 ఏళ్లు. కూతురికి 12 ఏళ్లు. మరో కొడుకుకు 7ఏళ్లు. కొడుకు నికేంద్రకు గుండెకు చిల్లు ఉంది. దీంతో అతను ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేవాడు. ఈక్రమంలో నీ కుటుంబంలో ఎవరినైనా బలి ఇస్తే నీ కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందని ఎవరో చెప్పారు. కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆ మాటలు నమ్మేసింది రేఖ. దీంతో భర్త శివరాజ్ ను చంపటానికి పూనుకుంది. భర్త నిద్రపోతున్న సమయంలో కత్తితో పొడటానికి యత్నించింది. కానీ శివరాజ్ తప్పించుకున్నాడు. అలా వారం రోజులు గడిచాయి.

ఆ తరువాత రేఖ భర్త తప్పించుకోవటం ఆమె కన్ను ఇంట్లో ఉన్న కూతురు, మరో కొడుకుపై పడ్డాయి. అలా ఆదివారం (నవంబర్ 2,2022) తన 7 ఏళ్ల కొడుకు సింగం, కుమార్తె సంజనను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించింది. కానీ అప్పుడు కూడా వవిఫలమైంది. మళ్లీ అదే రోజు సంజనకు స్నానం చేయిస్తుండగా..ఆమె వాష్‌రూమ్‌లో గొంతుకోసి చంపింది. ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు రేఖను అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురించి డీఎస్పీ తరుణ్‌ కాంత్‌ మాట్లాడుతూ.. తన 16 ఏళ్ల కొడుకు నిరేంద్ర సింగ్ గుండెలో రంధ్రం పడిందని తెలుసుకున్నప్పటినుంచి రేఖ మానసికంగా కుంగిపోయిందని ఆమె భర్త శివరాజ్ తెలిపాడని ఈక్రమంలో ఎవరో ఇంట్లో ఎవరినైనా బలి ఇస్తే నికేంద్రం ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పటంతో నమ్మి కొడుకుమీద ప్రేమతో ఇటువంటిపనికి పూనుకుందని తెలిపారు.నికేంద్ర సింగ్ ప్రస్తుత చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పోలీసులు బాలిక మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని నిందితురాలు రేఖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

 

murder in superstition