Mysterious: మూడు రోజులుగా తల్లి మృతదేహం పక్కనే కుమారుడు

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలోని దారుణం జరిగింది. తల్లి మృతదేహంతో కుమారుడు మూడు రోజులుగా అపార్టుమెంట్‌లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.

Mysterious: మూడు రోజులుగా తల్లి మృతదేహం పక్కనే కుమారుడు

Mysterious

Mysterious: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి కాలనీలోని దారుణం జరిగింది. తల్లి మృతదేహంతో కుమారుడు మూడు రోజులుగా అపార్టుమెంట్‌లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. స్థానిక మైత్రినివాస్ అపార్టుమెంట్‌లోని ప్లాట్ నెంబర్ 202లో కుళ్లిపోయిన స్థితిలో విజయ అనే మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం పక్కనే ఆమె కుమారుడు సాయికృష్ణ మూడు రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో, అపార్టుమెంటు వాసులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు అక్కడకు చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, సాయికృష్ణ మానసిక స్థితి బాగా లేదని, తరచూ తల్లీ కొడుకులు గొడవ పడుతుండే వారని స్థానికులు చెప్పారు. మానసిక స్థితి బాగా లేని కొడుకే తల్లిని చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.