Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు

నేపాల్‌లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం నేపాల్‌లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్‌కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.

Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు

Nepal Plane

Nepal plane: నేపాల్‌లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం నేపాల్‌లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్‌కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ముస్తాంగ్ జిల్లాలోని జామ్సన్ గగనతలంలో విమానం చివరిసారిగా కనిపించిందని, ఆ తర్వాత దౌలగిరి పర్వతం వైపు మళ్లిందని, ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని నేపాల్ అధికారులు తెలిపారు. విమానంలో ముగ్గురు సిబ్బందితోపాటు, మరో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయులు కాగా, ముగ్గురు జపాన్‌కు చెందిన వాళ్లు. మిగతా ప్రయాణికులు నేపాలీలు.

monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

కాగా, గల్లంతైన విమానం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రెండు ప్రైవేటు హెలికాప్టర్ల ద్వారా విమానం గల్లంతైన ప్రాంతంలో గాలింపు జరుపుతున్నారు. ఈ రెండింటితోపాటు నేపాల్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటుంది. నేపాల్‌లో పర్వతాలు ఎక్కువ. దీంతో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశీయ విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.