ముహూర్తం ఫిక్స్.. ఫలక్‌నుమాలో పెళ్లి..

  • Published By: sekhar ,Published On : July 2, 2020 / 12:23 PM IST
ముహూర్తం ఫిక్స్.. ఫలక్‌నుమాలో పెళ్లి..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలినీల పెళ్లి తేది ఖరారైంది. వాస్తవానికి నితిన్, షాలిని కందుకూరిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత వీరి పెళ్లి డిసెంబర్లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఇరు కుటుంబాల వారు చర్చించుకుని ఈ నెల 12 నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టనున్నారు.

Nithin-Wedding

ఈ నెల 20తో ఆషాఢ మాసం పూర్తవుతుంది కాబట్టి జూలై 26న మంచి ముహూర్తం ఉందని ఆ తేదిని ఫిక్స్ చేశారు. జూలై 26న ఫలక్‌నుమాలో వీరి పెళ్లి జరుగనుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50 మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగనుంది. సినిమాల విషయానికొస్తే ‘భీష్మ’తో సక్సెస్ అందుకున్న నితిన్.. వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ చిత్రంతో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

Read:నమ్రతా ఒంటిపై మహేశ్ టాట్టూ.. మీకు తెలుసా