Yoga guru Ramdev: పతాంజలి మెయిన్ క్యాంపస్‌లో కరోనా పాజిటివ్ లేదు – రామ్‌దేవ్

యోగా గురు రామ్ దేవ్ కొన్ని మీడియాల్లో వస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పతాంజలి యోగ్ పీఠ్ మెయిన్ క్యాంపస్ లో ఒక్క కరోనావైరస్..

Yoga guru Ramdev: పతాంజలి మెయిన్ క్యాంపస్‌లో కరోనా పాజిటివ్ లేదు – రామ్‌దేవ్

Ramadev

Yoga guru Ramdev: యోగా గురు రామ్ దేవ్ కొన్ని మీడియాల్లో వస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పతాంజలి యోగ్ పీఠ్ మెయిన్ క్యాంపస్ లో ఒక్క కరోనావైరస్ పాజిటివ్ కేసు కూడా లేదని చెప్పేశారు. ఆచార్యకులం నుంచి వచ్చిన కొత్త పేషెంట్లలో 14మంది విజిటర్లకు కొవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ గా వచ్చింది. వారినెవ్వరినీ మెయిన్ క్యాంపస్ లోకి అనుమతించలేదని అన్నారు.

పతాంజలిలో ఒక్కరు కూడా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కు గురి కాలేదు. ఆచార్యకులం నుంచి అడ్మిషన్ కోసం వచ్చిన కొత్త స్టూడెంట్లను ప్రొటోకాల్ ప్రకారం.. టెస్టు చేయించాం. పాజిటివ్ గా వచ్చిన 14మంది విజిటర్లను లోపలికి అనుమతించలేదు. ఈ రిపోర్టులను పక్కకుబెట్టి రూమర్లు, అబద్ధాలే ప్రచారం జరుగుతున్నాయి. నేను ప్రతి రోజూ యోగా, హెల్త్ గురించి లైవ్ ప్రోగ్రాంలు చేస్తున్నా అని ట్వీట్లలో వెల్లడించారు.

అయితే ఒక మీడియా మాత్రం పతాంజలి మెయిన్ క్యాంపస్ లో 83మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చింది. వాటిని పతాంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారావాలా గురువారం మాట్లాడుతూ.. తోసిపుచ్చారు.