సరికొత్త షో తో తారక్.. నయా అవతార్..
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు టెలివిజన్ షోల తోనూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కి తారక్ హోస్టింగ్ చెయ్యగా ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు తారక్..
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’.. ఈ పాపులర్ షో లో ఇప్పటివరకు తెలుగులో నాలుగు సీజన్లు రాగా.. మొదటి మూడు సీజన్లకు కింగ్ నాగార్జున, నాలుగో సీజన్కి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిరు, నాగ్ ఇద్దరూ హోస్టింగ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గెస్ట్గా వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు అలాంటి ఓ సరికొత్త రియాలిటీ షోకి హోస్టింగ్ చెయ్యబోతున్నారు.
ఈ షో కోసం పాపులర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమిని టీవీ యాజమాన్యం భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసింది. తారక్ హోస్ట్గా వ్యవహరించబోయే ఈ షో ని సదరు ఛానెల్ సరికొత్తగా డిజైన్ చెయ్యడంతో పాటు ఎన్టీఆర్కి హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇవ్వబోతుందట. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేసి ఏప్రిల్ నుండి షోను టెలికాస్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు.