అప్పుడు గెస్ట్.. ఇప్పుడు హోస్ట్!..

అప్పుడు గెస్ట్.. ఇప్పుడు హోస్ట్!..

Evaru Meelo Koteeswarudu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు టెలివిజన్ షో తోనూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కి తారక్ హోస్టింగ్ చెయ్యగా ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు తారక్..

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో తో బుల్లితెరపై ఎన్టీఆర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌ను ‘‘ఎవరు మీలో కోటీశ్వరుడు’’ అని పేరు మార్చారు.. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ షో టెలికాస్ట్ కానుంది. మార్చి ఫస్ట్ వీక్ నుంచి షో కి సంబంధించి ఎంట్రీస్ స్టార్ట్ అవుతున్నాయి.

ఈ పాపులర్ ప్రోగ్రామ్‌కి హోస్టింగ్ చెయ్యనున్న తారక్ ప్రస్తుతం ప్రోమో షూట్‌‌లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్‌పై ప్రోమోస్ షూట్ చేస్తున్నారు.

కాగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’.. షో లో ఇప్పటివరకు తెలుగులో నాలుగు సీజన్లు రాగా.. మొదటి మూడు సీజన్లకు కింగ్ నాగార్జున, నాలుగో సీజన్‌కి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిరు, నాగ్ ఇద్దరూ హోస్టింగ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు అలాంటి ఓ సరికొత్త రియాలిటీ షోకి హోస్టింగ్ చెయ్యబోతుండడం విశేషం..