NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున సన్నిధిలో చీఫ్ జస్టిస్!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి చీఫ్ జస్టిస్ తెలుగు రాష్ట్రాల పర్యటనలో..

NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున సన్నిధిలో చీఫ్ జస్టిస్!

Nv Ramana

NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి చీఫ్ జస్టిస్ తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉండగా ఇప్పటికే తిరుమల శ్రీవారితో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహుని దర్శించుకున్నారు. కాగా, నేడు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైలం చేరుకుని.. స్వామి సేవలో పాల్గొన్నారు. సీజేఐ ఎన్‌.వి.రమణకు ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

నందిని అతిథి గృహం వద్ద జస్టిస్ ఎన్వీ రమణకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీఐజీ వెంకట రామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపా సాగర్, ఎస్పీ పకీరప్ప, హైకోర్టు రిజిస్ట్రార్ జస్టిస్ వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసులు, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు స్వాగతం పలికారు.