ప్రసూతి వార్డులోకి అనుమతించలేదని డాక్టర్ చెవి కొరికేసిన గర్భిణి భర్త

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న డాక్టర్ పై దాడి చేశాడు. డాక్టర్ చెవి

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 02:35 AM IST
ప్రసూతి వార్డులోకి అనుమతించలేదని డాక్టర్ చెవి కొరికేసిన గర్భిణి భర్త

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న డాక్టర్ పై దాడి చేశాడు. డాక్టర్ చెవి

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న డాక్టర్ పై దాడి చేశాడు. డాక్టర్ చెవి కొరికేశాడు. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోకి అనుమతించలేదనే కోపంతో ఓ గర్భిణి భర్త ఈ దురాఘతానికి ఒడిగట్టాడు. గంజాం జిల్లా బ్రహ్మపుర మహారాజా కృష్ణచంద్ర గజపతి (ఎమ్కేసీజీ) వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆదివారం(మే 10,2020) ఈ ఘటన జరిగింది.

ఆసుపత్రి స్త్రీ రోగ, ప్రసూతి విభాగం డాక్టర్ భారతి మిశ్ర, వైద్యుడు స్మృతిరంజన్ పట్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా పురుషోత్తంపూర్ ప్రాంతానికి చెందిన తరుణి ప్రసాద్ మహాపాత్ర తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్లు అత్యవసరంగా ఆమెను ప్రసూతి వార్డుకి తరలించారు. అప్పటికే ఆమె దగ్గర ఐదుగురు కుటుంబసభ్యులు ఉన్నారు.

కాగా, తనను కూడా ప్రసూతి వార్డులోకి వెళ్లేందుకు అనుమతించాలని భర్త ప్రసాద్ పట్టుబడ్డాడు. అందుకు డాక్టర్లు, సిబ్బంది అనుమతించ లేదు. దీంతో ప్రసాద్ రెచ్చిపోయాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. డాక్టర్ స్మృతిరంజన్ పై దాడి చేశాడు. అక్కడే ఉన్న మరో నలుగురు డాక్టర్లు ప్రసాద్ ను అడ్డుకున్నారు. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. వారిపై దాడి చేశాడు. ఓ డాక్టర్ చెవి కొరికేశాడు. ప్రసాద్ తీరుతో డాక్టర్లు, వైద్య సిబ్బంది హడలిపోయారు. వారు భయాందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ ను అరెస్టు చేశారు.

Read More :

దుర్మార్గపు కొడుకు : సమాధిలో తల్లిని పాతిపెట్టాడు..3 రోజుల తర్వాత

కరోనాకు మందు కనిపెట్టి తనపైనే ప్రయోగించుకుని ప్రాణాలు కోల్పోయిన ఫార్మసిస్ట్