Covid: ముంబైలో క‌రోనా విజృంభ‌ణ‌.. 10,889కి పెరిగిన యాక్టివ్ కేసులు

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధిక‌మ‌వుతోంది. ముంబైలో ఆదివారం 100కు పైగా క‌రోనా బాధితులు ఆసుప‌త్రుల్లో చేరారు.

Covid: ముంబైలో క‌రోనా విజృంభ‌ణ‌.. 10,889కి పెరిగిన యాక్టివ్ కేసులు

Covid 19

Covid: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధిక‌మ‌వుతోంది. ముంబైలో ఆదివారం 100కు పైగా క‌రోనా బాధితులు ఆసుప‌త్రుల్లో చేరారు. ఒక్క‌రోజులో అంత‌మంది ఆసుప‌త్రుల్లో చేర‌డం నాలుగు నెల‌ల్లో ఇదే తొలిసారి. అంతేగాక, ఆదివారం ముంబైలో క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. వారిద్ద‌రి వ‌య‌సు 40 ఏళ్ల‌లోపే ఉంటుంది. ముంబైలో క‌రోనా పాజిటివిటీ రేటు 11 శాతానికి పెరిగింది. మ‌హారాష్ట్రలో కొత్త‌గా 2,946 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వాటిలో 1,803 కేసులు ముంబైలోనే నిర్ధార‌ణ అయ్యాయి. శ‌నివారం ముంబైలో 1,745 కేసులు న‌మోద‌య్యాయి.

National Herald case: రాహుల్ అన్ని ఆరోప‌ణ‌ల నుంచి బయ‌ట‌ప‌డ‌తారు: రాబ‌ర్ట్ వాద్రా

మ‌హారాష్ట్రలో జూన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 23,491 క‌రోనా కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. వాటిలో దాదాపు 15,000 కేసులు ముంబైలోవే. ఆదివారం ముంబైలో మొత్తం 111 మంది క‌రోనాకు చికిత్స కోసం ఆసుప‌త్రుల్లో చేరార‌ని అధికారులు వివ‌రించారు. వారిలో దాదాపు 10 మంది ఆక్సిజ‌న్ ప‌డ‌క‌ల‌పై చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించారు. ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 425కి చేరింద‌ని తెలిపారు. ఆసుప‌త్రుల్లో క‌రోనా బాధితుల‌ పడకలు 1.7 శాతం నిండాయ‌ని చెప్పారు. ఆరుగురు వెంటిలేట‌ర్‌పై ఉన్నార‌ని, వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. మ‌హారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం 16,370కి చేర‌గా, ముంబైలో 10,889కి పెరిగింద‌ని వివ‌రించారు.