మనిషిలో ‘మనీ’ అన్న పదముంది.. మనిషేంటో ఆ ‘మనీ’ ఏ చెబుతుంది..
Mosagallu: మంచు విష్ణు హీరోగా నటిస్తూ.. AVA Entertainment, 24 Frames Factory బ్యానర్స్పై నిర్మిస్తున్న చిత్రం.. ‘మోసగాళ్లు’. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
శుక్రవారం ఈ సినిమా నుండి ‘పైసా మే పరమాత్మ హై’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. శామ్ సిఎస్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరాశ్రీ లిరిక్స్ రాసిన ఈ పాటను లవితా లోబో బ్యూటిఫుల్గా పాడారు. డబ్బుగొప్పదనం చెబుతూ.. పైసలకోసం ప్రజలు పడే పాట్ల గురించి చెబుతూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.
కాజల్ అగర్వాల్ ఇందులో విష్ణు సోదరిగా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో రుహీ సింగ్ హీరోయిన్.. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలో విడుదల తేదీ ఖరారు చెయ్యనున్నారు.