Pakistan Terrorist : పాకిస్తాన్ ఉగ్రవాది అష్రఫ్ విచారణలో కీలక విషయాలు వెల్లడి

పాకిస్తాన్ ఉగ్రవాది అష్రఫ్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.  పోలీసుల విచారణలో అష్రఫ్ కీలక విషయాలు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఉగ్రవాది అష్రఫ్ పోలీసులకు పట్టుబడ్డారు.

Pakistan Terrorist : పాకిస్తాన్ ఉగ్రవాది అష్రఫ్ విచారణలో కీలక విషయాలు వెల్లడి

Pak Terrorist

terrorist Ashraf revealed key details : పాకిస్తాన్ ఉగ్రవాది అష్రఫ్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.  పోలీసుల విచారణలో అష్రఫ్ కీలక విషయాలు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఉగ్రవాది అష్రఫ్ పోలీసులకు పట్టుబడ్డారు. 2009లో జమ్మూ బస్టాండ్ దగ్గర జరిగిన పేలుళ్లలో అష్రఫ్ నిందితుడుగా ఉన్నాడు. 2011లో హైకోర్టు పేలుళ్ల కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. ఐదుగురు జవాన్ల హత్య కేసులో అతన్ని నిందితుడిగా గుర్తించారు.

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది. పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టును నిన్న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ సెల్‌ పోలీసులు ఆ ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకే-47తోపాటు హ్యాండ్ గ్రనేడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్‌ఐ ఏజెంట్ అయిన ఈ ఉగ్రవాది… ఢిల్లీలో దాడులకు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫేక్‌ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటరయ్యాడు. కానీ.. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది.

Terrorist Arrest : ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. పాకిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు

దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జమ్ముకశ్మీర్‌తోపాటు దేశంలోని ప్రధాన నగారాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ, యూపీ, జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా 18చోట్ల తనిఖీలు చేస్తోంది.

ఎన్‌కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్‌ దళాలు దూకుడు పెంచాయి. ఈరోజు షోపియన్‌లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వాళ్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగిలిన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది.

Manipur : మణిపూర్ లో ఉగ్రవాదుల కాల్పులు..ఐదుగురు పౌరులు మృతి

ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇవాళ జమ్మూకశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిన్న 16 చోట్ల సోదాలు నిర్వహించింది.