పాకిస్తాన్‌కు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు

పాకిస్తాన్‌కు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు

Pakistan to get 45 million :భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్‌లకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపధ్యంలోనే.. ఇండియాలో తయారైన 4.5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను పాకిస్తాన్‌కు పంపించబోతుంది కేంద్ర ప్రభుత్వం. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్(GAVI)లో భాగంగా ఈ వ్యాక్సిన్లు పాకిస్తాన్‌కు వస్తున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఫెడరల్ సెక్రటరీ ఆమిర్ అష్రఫ్ ఖవాజా అక్కడి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెల్లడించారు.

ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించేలా ప్రపంచంలోని సగం మంది పిల్లలకు వ్యాక్సినేట్ చేయడానికి గవి అలయెన్స్ సాయం చేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలోనూ ఈ గవియే పాకిస్తాన్‌కు సాయం చేస్తూ వస్తోంది.

పాకిస్తాన్‌కు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడానికి సెప్టెంబర్‌లో గవీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 4.5 కోట్ల డోసుల వ్యాక్సిన్లలో 1.6 కోట్ల డోసులు జూన్‌నాటికి పాకిస్తాన్‌ వస్తాయని అష్రఫ్ ఖవాజా వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ ప్రశ్నించినప్పుడు.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు వ్యాక్సిన్లను అందించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ గవీ అలయెన్స్‌లో భాగంగా పాకిస్తాన్‌కు వ్యాక్సిన్‌లు అందిస్తున్నారు.