దుర్మార్గపు కొడుకు : సమాధిలో తల్లిని పాతిపెట్టాడు..3 రోజుల తర్వాత

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 11:56 AM IST
దుర్మార్గపు కొడుకు : సమాధిలో తల్లిని పాతిపెట్టాడు..3 రోజుల తర్వాత

నవమాసాలు మోసి కన్న తల్లి గురించి ఎంత రాసిన తక్కువే…కన్న పిల్లల కోసం తల్లి తన ప్రాణాలివ్వడానికి కూడా సిద్దపడుతుంది. అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో నిజాయితీ గత ప్రేమ ఉందంటే అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. అది స్వచ్ఛమైంది. నవమాసాలు మోసి కన్న బిడ్డకు, తల్లికి మధ్య ఉండే బంధమే వేరు.

వృద్దాప్యంలో తనను ఆదుకుంటాడని, కష్టం రాకుండా చూసుకుంటాడని ఏ తల్లైనా అనుకుంటుంది. కానీ ఓ దుర్మార్గపు కొడుక్కు మాత్రం తల్లి భారంగా మారింది. ఆమెను చంపేయాలని అనుకున్నాడు. సమాధిలో పాతిపెట్టాడు. కానీ..మూడు రోజుల తర్వాత..ఆమె ప్రాణాలతో బయటపడిన ఘటన సంచలనం రేపుతోంది. చైనాలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

ఉత్తర చైనాలోయాస్ తల్లి పాక్షిక పక్షవాతంతో బాధ పడుతోంది. దీంతో ఆమెకు రోజు కావాల్సిన పనులు చేసే పరిస్థితి యాస్ కు వచ్చింది. ఆమెకు సపర్యియలు చేయడం..సంరక్షణ చూసుకోవడం భారంగా అనుకున్నాడు. ఇలా కాదు..చంపేస్తే తన కష్టం దూరం అవుతుందని భావించాడు. అనుకున్నట్లుగానే…తన ప్లాన్ ను అమల్లో పెట్టాడు. 2020, మే 02వ తేదీన తల్లిని వీల్ ఛైర్ లో బయటకు తీసుకెళ్లాడు. 

తిరిగి ఒక్కడే ఇంటికి వచ్చాడు. తర్వాత వస్తుందని అనుకుంది యాస్ భార్య. ఒకటి, రెండు రోజులు గడిచాయి. కానీ ఆమె రాలేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది యాస్ తల్లి. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా..దారుణమైన విషయాన్ని చెప్పాడు. తన తల్లిని సమాధిలో పాతిపెట్టడం జరిగిందని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. ఎక్కడైతే పాతిపెట్టాడో అక్కడకు హుటాహుటిన పోలీసులు వెళ్లారు.

సమాధిలో నుంచి ఏవో శబ్దాలు రావడంతో..వెంటనే అక్కడ తవ్వారు. సమాధిలో మట్టి కొట్టుకపోయి..నీరసంగా బాధ పడుతున్న యాస్ తల్లి కనిపించింది. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన యాస్ ను అదుపులోకి తీసుకున్నారు. 

Read More :

నర్సులు, డాక్టర్లకు గ్రీన్ కార్డులు.. అమెరికాలో కీలక చట్టం

కరోనావైరస్ పేషెంట్లు ఫాస్ట్ రికవరీకి ట్రిపుల్ డ్రగ్ థెరపీనే కరెక్ట్