గో సంరక్షులు చాంద్ బాషా, కవి – గాయకులు పెంచల్ దాస్లకు పవన్ సత్కారం..
రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్, గో సంరక్షులు చాంద్ బాషా గార్లను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా సత్కారించారు.
Penchal Das – Chand Bhasha: రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్, గో సంరక్షులు చాంద్ బాషా గార్లను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా సత్కరించారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన గో సంరక్షుడు చాంద్ భాషా దాదాపు 400 ఆవులతో గోశాలను నిర్వహించడంపై పవన్ ఆయణ్ణి అభినందించారు. చాంద్ భాషాను హైదరాబాద్ రమ్మని ఆహ్వానించి మర్యాద పూర్వకంగా సన్మానించారు.
పెంచల్ దాస్ రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని పవన్ కళ్యాణ్ అన్నారు. గీత రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ మంగళవారం హైదరాబాద్లో పవన్ని కలిశారు.
ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ రచయిత, దర్శకులు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. అనంతరం పెంచల్ దాస్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు.