జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటుపై హైకోర్టులో పిటిషన్‌

  • Published By: bheemraj ,Published On : December 3, 2020 / 02:41 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటుపై హైకోర్టులో పిటిషన్‌

GHMC elections ex-officio vote : మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ వేశారు.



జీహెచ్ఎంసీ చట్టంలో దీనికి సంబంధించిన సెక్షన్‌ని కొట్టివేయాలని పిటిషన్‌లో అనిల్ కుమార్ కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.



పిటిషనర్‌ ఆరోపించిన అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, SECతో పాటు జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. దీనిమీద తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసింది.