Mumbai: ఒకే వేదిక‌పై క‌న‌ప‌డ‌నున్న మోదీ, ఉద్ధ‌వ్ ఠాక్రే

గ‌తంలో స్నేహ బంధాన్ని కొన‌సాగించిన బీజేపీ, శివ‌సేన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం విడిపోయి, అప్ప‌టినుంచి ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి.

Mumbai: ఒకే వేదిక‌పై క‌న‌ప‌డ‌నున్న మోదీ, ఉద్ధ‌వ్ ఠాక్రే

Modi Uddav

Mumbai: గ‌తంలో స్నేహ బంధాన్ని కొన‌సాగించిన బీజేపీ, శివ‌సేన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం విడిపోయి, అప్ప‌టినుంచి ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి. ఇరు పార్టీల మ‌ధ్య ప్ర‌స్తుతం ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంతలా ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ముంబైలో నేడు ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకోనుంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, మ‌హారాష్ట్ర సీఎం, శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ ఠాక్రే ఒకే వేదిక‌పై క‌న‌ప‌డ‌నున్నారు.

presidential election: రేపు మ‌మ‌తా బెన‌ర్జీ నిర్వ‌హించే భేటీలో పాల్గొన‌నున్న కాంగ్రెస్‌

కాసేప‌ట్లో ముంబైలోని ప‌లు ప్రాంతాల్లో ఇద్ద‌రు క‌లిసి ప‌ర్య‌టించ‌నున్నారు. ముంబైలో రెండు కార్యక్ర‌మాల్లో పాల్గొన‌డానికి ఆ న‌గ‌రానికి మోదీ వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ముంబైలోని నావ‌ల్ హెలిపోర్ట్ ఐఎన్ఎస్ శిఖ‌ర వ‌ద్ద ఉద్ధ‌వ్ ఠాక్రే స్వాగ‌తం ప‌లుకుతారు. అక్క‌డి నుంచి మోదీ, ఉద్ధ‌వ్ ఠాక్రే క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్తారు. ఇక్క‌డ జ‌ర‌గ‌నున్న ఓ కార్య‌క్రమంలో వారిద్ద‌రూ క‌లిసి వేదిక పంచుకుంటారు. అనంత‌రం అక్క‌డి నుంచి వారిద్ద‌రు క‌లిసి వెళ్లి బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో వారు పాల్గొంటారు. అనంత‌రం మోదీ ఢిల్లీకి వెళ్తారు. మోదీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ముంబైలో పోలీసులు భ‌ద్ర‌తా పెంచారు.