అందం, అభినయం.. ఒకే స్క్రీన్ మీద..

  • Published By: sekhar ,Published On : December 3, 2020 / 04:51 PM IST
అందం, అభినయం.. ఒకే స్క్రీన్ మీద..

Pooja Hegde – Rashmika Mandanna: పూజా హెగ్డే, రష్మిక మందాన్న ఇద్దరు హీరోయిన్లు సౌత్‌లో నంబర్ వన్ కావాలని ఆరాట పడుతున్నారు. ఒకళ్లకి మించి ఒకళ్లకి అదే రేంజ్‌లో క్రేజ్ కూడా ఉంది. ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తేనే ఆ అందానికి, అభినయానికి ఎట్రాక్ట్ అవుతున్న వాళ్లు.. ఇప్పుడు ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే.. అబ్బో ఆ ఇమాజినేషనే సూపర్ అనుకుంటూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.



‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అని టాలీవుడ్‌తో పాటు ఇండియా మొత్తం డ్యాన్స్ చేయించేసింది పూజా. ‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ కుర్రకారుని తెగ టీజ్ చేసేసింది రష్మిక. ప్రజెంట్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా చలామణి అవుతున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు.


టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉంటున్న పూజా, సౌత్‌లో స్టార్ హీరోలతో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక.. ఇద్దరూ మరో సౌత్ స్టార్ హీరోకి జంటగా నటించబోతున్నారు. హను రాఘవపూడి-దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో, వైజయంతీ మూవీస్ బ్యానర్ సంస్థ నిర్మించనున్న అనౌన్స్ చేసిన రెట్రో మూవీలో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు ఈ ముద్దుగుమ్మలు.


లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్‌గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి.. దుల్కర్ సల్మాన్‌తో 1960 నాటి స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా స్టోరీ ఇంట్రస్టింగ్‌గా ఉండడంతో ఇద్దరు హీరోయిన్లు ఓకే చెప్పేశారని, ఆల్రెడీ దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయ్యిందని టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ నిజమైతే.. అటు అందాన్ని, ఇటు అభినయాన్ని ఒకే స్క్రీన్ మీద చూసే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే ఆడియెన్స్.