2022లో ప్రభాస్ మూవీ.. ఆ సీక్వెల్ తర్వాతే రిటైర్ అవుతా..

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా మరియు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి 2’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు నిర్మాత అశ్వినీ దత్..

  • Published By: sekhar ,Published On : May 9, 2020 / 09:27 AM IST
2022లో ప్రభాస్ మూవీ.. ఆ సీక్వెల్ తర్వాతే రిటైర్ అవుతా..

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా మరియు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి 2’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు నిర్మాత అశ్వినీ దత్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మెగా మేకర్ సి. అశ్వినీ దత్ నిర్మించిన మెమొరబుల్ హిట్ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రం విడుదలై ఈ మే 9 కి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అశ్వినీ దత్ మీడియాతో మాట్లాడారు. జగదేకవీరుడు గురించిన సంగతులతో పాటు, ప్రస్తుతం తాము నిర్మిస్తున్న చిత్రాల గురించి కొన్ని విశేషాలు చెప్పారు..

“యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసే సినిమా ప్రపంచ భాషల్లో సంచలనం సృష్టించేలా ఉంటుంది. రానున్న రెండున్నర సంవత్సరాలు మా సంస్థ ఆ ప్రెస్టీజియస్ పిక్చర్ వర్క్ లో ఉంటుంది. ఫారిన్ టెక్నీషియన్స్ చాలా మంది వర్క్ చేస్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటున్నాం.‘జగదేకవీరుడు అతిలోక సుందరి 2’ తీయమని అందరూ అడుగుతున్నారు. ప్రభాస్ సినిమా పూర్తయ్యాక తప్పకుండా జగదేకవీరుడు 2 చేస్తాను. ఎవరితో, ఎలా అనేది ప్లాన్ చేయాలి.. కచ్చితంగా ఆ సినిమా చేసిన తర్వాతే నేను నిర్మాతగా రిటైర్ అవుతాను..” అన్నారు మెగా మేకర్ అశ్వినీ దత్.

Read More :

వూహాన్ గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా.. బర్నింగ్ స్టార్?

‘లవ్ స్టోరి’లో లవ్లీగా సాయిపల్లవి..