Punjabi singer: నాకూ ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: పంజాబ్ సింగర్ వినతి

పంజాబ్ సింగర్ మన్‌కీర్త్ ఔలక్, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దవిందర్ బంబిహా గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే భద్రత పెంచాలని మన్‌కీర్త్ పంజాబ్ పోలీసులను కోరాడు.

Punjabi singer: నాకూ ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: పంజాబ్ సింగర్ వినతి

Mankirt Aulakh

Punjabi singer: రెండు రోజుల క్రితం జరిగిన దుండగుల కాల్పుల్లో ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ఒక్క రోజు ముందే రాష్ట్రంలోని పలువురు వీఐపీలకు భద్రత తొలగిస్తూ ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సిద్ధూపై జరిగిన కాల్పులు సంచలనం సృష్టించాయి. ఈ పరిస్థితుల్లో తమకు కూడా ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా మరో పంజాబ్ సింగర్ మన్‌కీర్త్ ఔలక్, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దవిందర్ బంబిహా గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే భద్రత పెంచాలని మన్‌కీర్త్ పంజాబ్ పోలీసులను కోరాడు. గత ఏప్రిల్‌లో ఈ యువ సింగర్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త

దీంతో మన్‌కీర్త్ తనకు సెక్యూరిటీ కావాలని కోరుతున్నాడు. కాగా, సిద్ధూ మూసేవాలా హత్యకు తామే కారణమని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గ్యాంగ్‌స్టర్ విక్కీ ముద్దూఖేరా హత్యకు ప్రతీకారంగానే సిద్ధూను చంపినట్లు చెప్పాడు. గోల్డీకి, పంజాబ్‌లోని లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం లారెన్స్ జైల్లో ఉన్నాడు. ఆయనకు కూడా హత్యతో సంబంధం ఉందని గోల్డీ పేర్కొన్నాడు. కాగా, లారెన్స్ బిష్ణోయ్, దవిందర్ గ్యాంగ్‌లు పంజాబ్‌లో హింసకు పాల్పడుతున్నాయి. గత నెలలో మన్‌కీర్త్‪కు వార్నింగ్ ఇచ్చింది దవిందర్ గ్యాంగ్.