Puri Jagannadh : కరణ్ జోహార్ చెప్పాడని లైగర్ లో అనన్య పాండేని తీసుకున్నా.. నేను వేరే హీరోయిన్ అనుకున్నా..
పూరి జగన్నాధ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ''విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగం కావాలని కరణ్ జోహార్ని కలిశాను. కథ విన్న వెంటనే ఆయన ఓకే అన్నారు. ముందు నుంచి ఈ సినిమాలో విజయ్కు జోడీగా..............
Puri Jagannadh : విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ఇండియా అంతా గత వారం రోజులుగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ ఈ సినిమా గురించి మాట్లాడాడు.
పూరి జగన్నాధ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాక నిర్మాణంలో భాగం కావాలని కరణ్ జోహార్ని కలిశాను. కథ విన్న వెంటనే ఆయన ఓకే అన్నారు. ముందు నుంచి ఈ సినిమాలో విజయ్కు జోడీగా జాన్వికపూర్నే అనుకున్నాను. నేను శ్రీదేవి అభిమాని కావడంతో నా ప్రాజెక్ట్తో శ్రీదేవి కూతురిని తెలుగులో పరిచయం చేయాలనుకున్నాను జాన్విని కలిసి కథ కుడా చెప్పాను. కానీ జాన్వి డేట్స్ సర్దుబాటు అవ్వలేదు. దీంతో జాన్వీ ఈ ప్రాజెక్టు వదులుకుంది. ఇదే విషయాన్ని కరణ్ జోహార్కు చెప్తే ఆయనే అనన్యా పాండేను తీసుకోమని చెప్పారు. కరణ్ జోహార్ చెప్పడంతో ఈ సినిమాలోకి అనన్యను తీసుకున్నాం. షూటింగ్ మొదలయ్యాక అర్థమైంది తను చాలా మంచి నటి అని. ప్రతి సీన్లోనూ హావభావాలు చాలా బాగా ఇచ్చేది. ఈ సినిమా తర్వాత ఆమెకు యూత్లో ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది” అని తెలిపాడు. ఈ విషయం తెలిసి జాన్వీ ఎంట్రీ మిస్ అయిపోయింది అని జాన్వీ టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు.