R.Krishnaiah: నా మీద ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా: ఆర్ కృష్ణయ్య

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

R.Krishnaiah: నా మీద ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా: ఆర్ కృష్ణయ్య

R. Krishnaiah

R.Krishnaiah: తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణయ్యపై తాజాగా పోలీసు స్టేషన్‌లో, హెచ్చార్సీలో ఫిర్యాదు కూడా చేశాడు.

Liquor Delivery: పది నిమిషాల్లో మద్యం డెలివరీ.. ప్రారంభించిన హైదరాబాద్ సంస్థ

రౌడీలు, గూండాలతో తనను చంపేందుకు కృష్ణయ్య ప్రయత్నిస్తున్నాడని, తన భూమిని కబ్జా చేశాడని, డబ్బులు తీసుకుని మోసం చేశాడని రవీందర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆర్.కృష్ణయ్య స్పందించారు. ఈ విమర్శల్ని తిప్పికొట్టారు. రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ‘‘నేను పేదలకు సహాయం చేసే వ్యక్తిని. బీసీల హక్కుల కోసం పోరాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొందరు వ్యక్తులు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నాపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కొందరి దగ్గర డబ్బులు తీసుకుని, భూమి కొనుగోలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆయన దగ్గర మోసపోయిన బాధితులు వచ్చి నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. రవీందర్ రెడ్డి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటాడు.

Bicycles: వలస కూలీల సైకిళ్ల వేలం… 21 లక్షల ఆదాయం

రవీందర్ రెడ్డి గతంలో ఈబీసీ సంఘం ఏర్పాటు చేసి బీసీలను మోసం చేశాడు. నాపై ఆరోపణలు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం జరిగిన విషయం. ఇప్పుడు దీనిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. సమస్యలు పరిష్కరించాలి అని నా దగ్గరకు రోజూ వందల మంది వస్తుంటారు. నేను బెదిరింపులు, కేసులకు భయపడే వ్యక్తిని కాను’’ అని కృష్ణయ్య వ్యాఖ్యానించారు.