Rafale Jets: నేడు భారత్కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు!
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా దిగుమతి చేసుకుంటున్న రఫెల్ విమానాలు వరసగా మన సైన్యంలో చేరుతున్నాయి. నేడు ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి.
Rafale Jets: భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా దిగుమతి చేసుకుంటున్న రఫెల్ విమానాలు వరసగా మన సైన్యంలో చేరుతున్నాయి. నేడు ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకోనున్నాయి. భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక దళ కేంద్రం వద్ద జెండా ఊపి వాటిని ప్రారంభించారు. భదౌరియా ఐదు రోజుల పర్యటనలో మూడో రోజు రాఫెల్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యుద్ధ విమానాలను సకాలంలో డెలివరీ చేసినందుకు ఫ్రెంచ్ ఏరో స్పేస్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక దళ కేంద్రం వద్ద నుండి నాలుగు యుద్ధ విమానాలు ఏకభిగిన 8వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దేశానికి చేరుకోనున్నాయి. ఈ నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్ రెండో స్క్వాడ్రన్ ఏర్పాటు మరింత వేగవంతం కానుండగా.. పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరంలో వీటిని మోహరించనున్నారు. మొదటి స్క్వాడ్రన్ను అంబాలా ఏర్బేస్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా రఫెల్ విమానాల రాకతో మన వాయుసేన సామర్ధ్యం మరింత బలంగా మారింది.
సుమారు రూ.58వేల కోట్ల వ్యయంతో 36 రాఫెల్ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్ 2016 సెప్టెంబర్లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 14 రాఫెల్ యుద్ధ విమానాలు రాగా.. నేడు మరో నాలుగు రఫెల్ విమానాలు ఇండియాకు రానున్నాయి. కొత్తగా వచ్చే ఈ నాలుగు యుద్ధ విమానాలతో ఈ సంఖ్య 18కి చేరనుంది. గతేడాది జూలై 29న రాఫెల్ మొదటి బ్యాచ్ జెట్లు దేశానికి చేరగా నేడు రెండో విడత విమానాలు రానున్నాయి. ఇవి కాక ఇంకా 18 యుద్ధ విమానాలు భారత్కు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది నాటికి మొత్తం రాఫెల్ జెట్లు భారత్కు చేరుకోనున్నాయి.