దేవనారాయణ్ ఆలయం పునాదుల్లో..11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోసిన గ్రామస్తులు

దేవనారాయణ్ ఆలయం పునాదుల్లో..11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోసిన గ్రామస్తులు

Rajasthan‌: రాజస్థాన్‌లోని ఝాల్వాడా జిల్లాలో రత్లాయీలో కొత్తగా నిర్మించనున్న దేవనారాయణ్ ఆలయానికి శంకుస్థాపనలో అరుదైన దృశ్యం కనుపించింది. దేవాయలం భూమి పూజ సందర్భంగా తీసిన పునాదులలో గ్రామస్తులు 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోశారు. పునాదుల్లో ఇలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందని గ్రామస్తులు నమ్మకం.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు రామ్‌లాల్ గుర్జర్ మాట్లాడుతూ దేవనారాయణ్ ఆలయ శంకుస్థాపన గుర్జర్ సమాజంలోని ప్రజల నుంచి 11 వేల లీటర్ల పాటు, పెరుగు, నెయ్యి అందాయని వాటిని గ్రామస్థుల చేతుల మీదుగానే ఆలయం పునాదుల్లో వేయించామని తెలిపారు.

దేవాలయం పునాదుల్లో 1,500 లీటర్ల పెరుగు, ఒక క్విటాల్ నెయ్యి, 8500ల లీటర్ల పాలు పోశామని తెలిపారు. వీటి మొత్తం ఖరీదు రూ. 1.50 లక్షలకు పైనే ఉంటుందన్నారు. ఆలయ నిర్మాణం సందర్భంగా పాల పదార్థాలు సమర్పించడం తమ ఆచారమని..ఇలా గతంలో కూడా ఆచరించామన్నారు. భగవంతుడు తమ పశువులను సంరక్షిస్తున్నాడని, అందుకే అ భగవంతుడు ప్రసాదించిన పాల పదార్థాలను అర్పించామని తెలిపారు.