Rashmi Gautam : ముంబై నుంచి వస్తేనే తీసుకుంటారు.. టాలీవుడ్‌పై రష్మి కౌంటర్

యాంకర్ రష్మీ గౌతమ్ టీవీ షోలలో యాంకర్ గా దూసుకెళ్తూనే సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా కూడా అడపాదడపా చిన్న చిన్న సినిమాలు చేస్తుంది. ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా.........

Rashmi Gautam : ముంబై నుంచి వస్తేనే తీసుకుంటారు.. టాలీవుడ్‌పై రష్మి కౌంటర్

Rashmi Gautam sensational comments on Tollywood

Rashmi Gautam :  యాంకర్ రష్మీ గౌతమ్ టీవీ షోలలో యాంకర్ గా దూసుకెళ్తూనే సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇక హీరోయిన్ గా కూడా అడపాదడపా చిన్న చిన్న సినిమాలు చేస్తుంది. ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది రష్మీ. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమే రష్మీ సినీ పరిశ్రమకి హీరోయిన్ అవుదామని వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇప్పుడు ఇలా యాంకర్ గా సెటిల్ అయి అప్పుడప్పుడు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ మీమర్ ఇప్పుడున్న యాంకర్స్ అందరి ఫోటోలని పెట్టి వీరంతా హీరోయిన్స్ అవ్వాల్సిన వాళ్ళు కానీ హీరోయిన్ ఎలా అవ్వాలో తెలియక యాంకర్స్ గా మిగిలిపోయారు అని పోస్ట్ చేశాడు. ఇందులో శ్రీముఖి, మంజూష, రష్మీ, స్రవంతి, అషురెడ్డి, విష్ణుప్రియ ఉన్నారు. వీళ్లంతా కూడా ప్రస్తుతం తెలుగులో యాంకరింగ్స్ చేస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తున్న వాళ్ళే. అలాగే వీళ్లంతా సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేయడానికి కూడా రెడీ అనేవాళ్లే. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.

Varaharoopam : ఓటీటీలో ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిన కాంతార..

దీంతో ఈ మీమ్ ని రష్మీ షేర్ చేస్తూ.. ఇది చాలా నిజం. ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్న అమ్మాయిలంతా తెలుగు వాళ్ళే. బాంబే బోర్డింగ్ పాస్ ఉంటే కథ వేరేగా ఉండేదేమో, అప్పుడు మేము వేసుకున్న బట్టలు కూడా ట్రెండ్ సెట్టింగ్ గా ఉండేవేమో అని పోస్ట్ చేసింది. దీంతో టాలీవుడ్ పై ఇండైరెక్ట్ గా ముంబై నుంచి వచ్చే వాళ్లనే తీసుకుంటారు, బోల్డ్ గా బట్టలు వేసుకున్నా ఛాన్సులు ఇవ్వరు అని కామెంట్ చేసింది. దీంతో రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారాయి.