శాండల్వుడ్ టు టాలీవుడ్ వయా బాలీవుడ్.. రష్మిక జర్నీ..
Rashmika Mandanna: కన్నడ హీరోయిన్.. సౌత్లో సైలెంట్గా సినిమాలు చేస్తోంది. ఈ భామ సక్సెస్ సౌండ్కి ఏకంగా బాలీవుడ్ ఫిదా అయ్యింది. అందుకే పిలిచి మరీ సినమా ఛాన్సిచ్చింది. ఆల్రెడీ సౌత్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్లో ఉన్న హీరోయిన్, బాలీవుడ్లో ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తోందో తెలుసా..?
వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ.. తెలుగులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందాన్న. బాలీవుడ్ భామలు టాలీవుడ్ని ఏలేస్తున్న ఈ టైమ్లో కూడా స్టార్ హీరోలతో వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ.. హీరోలకు ఓన్లీ ఆప్షన్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. అక్కడి భామలు ఇక్కడ చక్రం తిప్పుతుంటే.. రష్మిక కూడా నేనేం తక్కువా అంటూ బాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
సౌత్లో రష్మిక వరుసగా హిట్లు కొడుతూ మంచి జోష్లో ఉంది. లాక్ డౌన్ టైమ్లో స్క్రిప్టులు చదివానన్న రష్మిక వరుసగా సినిమాలు లైన్లో పెట్టేస్తోంది. లేటెస్ట్గా బాలీవుడ్లో మంచి ఛాన్స్ కొట్టేసింది. ‘మిషన్ మజ్ను’ టైటిల్తో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కోవర్ట్ ఆపరేషన్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సిద్దార్ధ్ మల్హోత్రా సరసన హీరోయిన్గా నటిస్తోంది రష్మిక.
ఫిబ్రవరి నుంచి ‘మిషన్ మజ్ను’ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ బాలీవుడ్ ఎంట్రీ మీద సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నానని, కొత్త ఆడియెన్స్ని రీచ్ అవ్వడానికి ఎంతో సంతోషంగా ఉన్నానని అంటోంది రష్మిక. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక.. బన్నీతో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ సినిమాలో బిజీగా ఉంది. ఇటు టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్తో పాటు ఇక బాలీవుడ్లో కూడా తన హవా నడిపిస్తుందన్న మాట రష్మిక.