RCB vs PBKS Match: కీలకపోరు.. పంజాబ్ టార్గెట్ 165

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లో 48వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య షార్జా మైదానంలో జరుగుతోంది.

RCB vs PBKS Match: కీలకపోరు.. పంజాబ్ టార్గెట్ 165

Punjab

Bangalore vs Punjab: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లో 48వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య షార్జా మైదానంలో జరుగుతోంది. పంజాబ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది బెంగళూరు జట్టు. దీంతో, పంజాబ్ టార్గెట్ 165గా నిర్దేశించారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పాడిక్కల్‌ క్రీజులోకి రాగా.. తొలి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 55 పరుగులు జోడించారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌(57) అర్ధ సెంచరీ చేయగా ఓపెనర్లు దేవ్‌దత్‌ పాడిక్కల్‌(40), విరాట్‌ కోహ్లి(25), డి విలియర్స్‌(23) పర్వాలేదని అనిపించారు. షాబాజ్‌ అహ్మద్ 8పరుగులు మాత్రమే చెయ్యగా.. డేనియల్ క్రిస్టియన్‌, జార్జ్‌ గార్టన్‌ డకౌట్ అయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌, మహమ్మద్‌ షమి చెరో మూడు వికెట్లు తీశారు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్లకు ఇది కీలకపోరు కాగా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇందులో గెలిస్తే బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌ వెళ్లే అవకాశం ఉంది. 14 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో బెంగళూరు జట్టు.. పంజాబ్‌ను ఓడిస్తే ప్లేఆఫ్స్‌లోకి వెళ్లిపోతుంది. మరోవైపు పంజాబ్‌ 10 పాయింట్లతో కొనసాగుతుండగా.. టాప్‌-4లో నిలవాలంటే మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి.

ఢిల్లీ, చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టగా.. బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ప్లేఆఫ్స్‌కు అత్యంత చేరువగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓడితే పంజాబ్‌‌కు ప్లే ఆఫ్ అవకాశాలే లేవు.