Ap High Court : ఏపి హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ

ఎంపిక విధానం విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష అధారంగా ఉంటుంది. స్ర్కీనింగ్ టెస్టు అబ్జెక్టీవ్ విధనాంలో ఉంటుంది.

Ap High Court : ఏపి హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీ

Ap High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఖాళీగా ఉన్న జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 55 పోస్టులుకాగా, ఈ ఉద్యోగాలకు విద్యార్హతగా లా లో బ్యాచిలర్ డిగ్రీ గా నిర్ణయించారు. అభ్యర్ధుల వయస్సు 01.07.2021నాటికి 35 సంవత్సరాలకు మించరాదు.

ఎంపిక విధానం విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష అధారంగా ఉంటుంది. స్ర్కీనింగ్ టెస్టు అబ్జెక్టీవ్ విధనాంలో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పరీక్షా సమయం 2గంటలు ఇస్తారు. 40శాతం పైగా మార్కులు సాధించిన వారిని 1:10 నిష్ఫత్తిలో రాతపరీక్షకు ఎంపిక చేస్తారు.

రాతపరీక్షకు సంబంధించి మొత్తం 3పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ టెస్ట్, ఎస్సే రైటింగ్ టెస్ట్ ఇలా 3విభాగులు గా ఉంటాయి. ప్రతి పేపరు 100 మార్కులకు ఉంటుంది. ఇందుకు 3గంటల సమయం కేటాయిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి వైవా కు ఎంపిక చేస్తారు. వైవాకు 50 మార్కులకు ఉంటుంది.

జీతంభత్యాలు నెలకు 27,700 నుండి 44,700 రూపాయల వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తులకు చివరి తేది 20.08.2021గా నిర్ణయించారు. పరీక్షా కేంద్రాలు గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://hc.ap.nic.in