‘మర్డర్’ మూవీ గురించి ఆర్జీవీ ఏమన్నారంటే..

‘మర్డర్’ మూవీ గురించి ఆర్జీవీ ఏమన్నారంటే..

RGV Live Interview: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘మర్డర్’.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం, అమృత, ప్రణయ్‌ల ప్రేమగాథ, అమృత తల్లిదండ్రుల వ్యతిరేకత వంటి అంశాలతో రూపొందించిన ఆర్జీవీ ‘మర్డర్’ సినిమా అనేక వివాదాలను ఎదుర్కొని ఎట్టకేలకు గురువారం విడుదలైంది.

ఈ సందర్భంగా సినిమా గురించి వర్మ 10 టీవీతో మాట్లాడారు. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా ఇదేనని, ‘మర్డర్’ ఒక కుటుంబ కథా చిత్రమని, పిల్లల్ని అతి గారాబం చెయ్యకూడదనే విషయాన్ని సినిమాలో చెప్పానని, తల్లిదండ్రులు అలాగే వారి పిల్లల ప్రేమ, అనుబంధాలు వంటివి బ్యాలెన్స్డ్‌గా చూపించానని, సినిమాకి మంచి స్పందన వస్తుందని వర్మ అన్నారు.