రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీ

robbery in pedana ysrcp mla jogi ramesh house: వైసీపీ నేత, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంటి ఆవరణతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో చోరీ జరగడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

పెడనలోని జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 12గంటల సమయంలో ఇంటి తాళం పగలగొట్టిన దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. డాగ్ స్క్వాడ్ కు దొరక్కుండా ఇంట్లో కారం చల్లినట్లు తెలుస్తోంది. ఇది దొంగల పనా లేక తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.

కాగా, ఏకంగా మ్మెల్యే ఇంట్లోనే చోరీ జగరడం స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీ జరిగితే ఇక సామాన్య జనం పరిస్థితేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో పని చేసేవారిని పోలీసులు విచారిస్తున్నారు.