Sai Pallavi : కశ్మీర్ ఫైల్స్ వివాదంపై మీడియా ముందు మాట్లాడిన సాయిపల్లవి

ప్రెస్ మీట్ లో సాయి పల్లవిని కశ్మీర్ ఫైల్స్ వివాదం గురించి అడగగా దానిపై మాట్లాడుతూ..''విరాట పర్వం సినిమా టైంలో నా పూర్తి వీడియో చూడకుండా క్లిప్ ఎడిట్ చేసి మాటలు వక్రీకరించి..........

Sai Pallavi : కశ్మీర్ ఫైల్స్ వివాదంపై మీడియా ముందు మాట్లాడిన సాయిపల్లవి

New Project

Sai Pallavi :  ఇటీవల విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కశ్మీర్ ఫైల్స్, గోహత్యల గురించి మాట్లాడింది. వీటిపై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దేశ వ్యాప్తంగా హిందువులు ఆమె వ్యాఖ్యలని ఖండించారు. పలువురు సెలబ్రిటీలు కూడా సాయి పల్లవి వ్యాఖ్యలు వ్యతిరేకించారు. పలు పోలీస్ స్టేషన్స్ లో సాయి పల్లవిపై కేసులు నమోదు అయ్యాయి. గతంలోనే ఓ సెల్ఫీ వీడియోతో వీటిపై వివరణ ఇచ్చిన సాయి పల్లవి తాజగా వీటిపై మొదటిసారి మీడియా ముందు మాట్లాడింది.

సాయి పల్లవి తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ గా చేసిన సినిమా ‘గార్గి’ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒక తండ్రి కోసం పోరాడే కూతురి కథ ఇది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఎప్పటిలానే సాయి పల్లవి తన నటనతో మెప్పించింది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది.

Nithin : ఒరేయ్ నితిన్ అంటూ.. నితిన్‌పై ఫైర్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మ రాజశేఖర్

ఈ ప్రెస్ మీట్ లో సాయి పల్లవిని కశ్మీర్ ఫైల్స్ వివాదం గురించి అడగగా దానిపై మాట్లాడుతూ..”విరాట పర్వం సినిమా టైంలో నా పూర్తి వీడియో చూడకుండా క్లిప్ ఎడిట్ చేసి మాటలు వక్రీకరించి వివాదం చేశారు. ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి అని కూడా చెప్పాను. ఇంకా ఆ విషయాన్ని అర్ధం చేసుకోలేక వివాదం సృష్టించారు. ఆ తర్వాత ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేశారు.” అని తెలిపింది.