దర్శకేంద్రుడు ప్రధాన పాత్రలో..
Samantha, Ramya Krishna and Sriya Saran: తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటుడిగా ఫస్ట్టైమ్ ఫుల్లెంగ్త్ రోల్ చేయబోతున్నారు. ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
‘శివగామి’ రమ్యకృష్ణ, శ్రియా శరణ్, సమంత అక్కినేని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే వీరిని సంప్రందించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ టాక్. సినిమా 2021 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.