Supreme Court: రేపిస్టుకు 30 ఏళ్ల జైలు శిక్ష.. మరణ శిక్ష రద్దు

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. కనీసం ముప్పయ్యేళ్ల వరకు నిందితుడిని విడుదల చేయడం, క్షమాభిక్ష పెట్టడం వంటి ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొంది.

Supreme Court: రేపిస్టుకు 30 ఏళ్ల జైలు శిక్ష.. మరణ శిక్ష రద్దు

Supreme Court

Supreme Court: ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. కనీసం ముప్పయ్యేళ్ల వరకు నిందితుడిని విడుదల చేయడం, క్షమాభిక్ష పెట్టడం వంటి ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొంది. జస్టిస్ ఏ.ఎమ్.ఖన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీ.టీ రవికుమార్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్‌లో, 2014లో బంధువు కూతురైన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి హత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడంతోపాటు, బాలికను క్రూరంగా చంపేశాడు.

Supreme Court : ఢిల్లీ షాహిన్ బాగ్ లో కూల్చివేతలపై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు

ఈ ఘటనలో నిందితుడు నేరానికి పాల్పడ్డట్లు అన్ని సాక్షాలు లభించాయి. దీంతో అతడికి కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను రద్దు చేయాలని కోరుతూ నిందితుడి తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మరణ శిక్షను రద్దు చేస్తూ, యావజ్జీవ శిక్షగా మార్చింది. నిందితుడి ఆర్థిక, సామాజిక అంశాల్ని, గతంలో ఏ నేర చరిత్ర లేదనే అంశాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ తీర్పునిచ్చినట్లు చెప్పింది. అలాగే నిందితుడు చేసింది తీవ్ర నేరమే అయినా, దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని, అందువల్లే మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.