Ujjaini Mahankali Jatara : సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు సర్వం సిధ్ధం
సికీంద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు సర్వం సిద్దమైంది...అన్నిశాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు సిటి పోలీసులు. ఉజ్జయిని మహాంకాళి బోనాల సంధర్బంగా ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు.
Ujjaini Mahankali Jatara : సికీంద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు సర్వం సిద్దమైంది…అన్నిశాఖల సమన్వయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు సిటి పోలీసులు. ఉజ్జయిని మహాంకాళి బోనాల సంధర్బంగా ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. నగరం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
మహంకాళి బోనాల సందర్భంగా ఈనెల 25,26 తేదీల్లో ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25న తెల్లవారుజాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బోనాల సందర్భంగా భారీగా వచ్చే భక్తుల కారణంగా సాధారణ వాహనదారులకు ఇబ్బందులు కాలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ వాహనాలను దారి మళ్లిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.
రోడ్లు మూసివేత
జులై 25న .. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు ఉదయం 4గంటలకు పూజ ప్రారంభం నుంచి పూర్తయే వరకు ……మహంకాళి ఆలయం నుంచి టొబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ సికింద్రాబాద్ రూట్లో ట్రాఫిక్ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, రోడ్లను మూసివేస్తారు..సుభాశ్ రోడ్ నుంచి బాటా చౌరస్తా, రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్,సింకింద్రాబాద్ మార్గాలను మూసివేస్తారు…ఆదయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం మార్గాలను మూసివేస్తారు.జనరల్ బజార్ నుంచి ఆలయం మార్గం రోడ్డు మూసివేస్తారు పోలీసులు.
ట్రాఫిక్ డైవర్షన్
ట్రాఫిక్ డైవర్షన్…తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు పోలీసులు..కర్బాలా మైదాన్ నుంచి మినిస్టర్ రోడ్కు వచ్చే సాధారణ ట్రాఫిక్ను, ఆర్టీసీ బస్లను రాణిగంజ్ చౌరస్తాలో మినిస్టర్ రోడ్డు,నుంచి రసూల్ పుర ఏక్స్ రోడ్డు ,గోపార పురం లైన్ రైల్వే స్టేషన్ వైపు దారి మళ్లిస్తారు..బైబిల్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను ఝాన్సీమండి ఎక్స్ రోడ్డు నుంచి సజ్జనాల్ స్ట్రీ, హిల్స్ స్ట్రీట్ వైపు మళ్లిస్తారు..ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్ను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తారు.
ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీహెచ్, క్లాక్ టవర్ వైపు మళ్లిస్తారు..క్లాక్టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్డు నుంచి ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు…సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీరోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్ ఎక్స్ రోడ్డు వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకు వైపు మళ్లిస్తారు.
ఈనెల 26న సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సెయింట్ మేరీ మార్గాలను మూసేస్తారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్పేట వెళ్లే ట్రాఫిక్ను క్లాక్ టవర్ నుంచి వయా ప్యాట్నీ, ఎస్బీహెచ్ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ ఏర్పాట్లు
ఉత్సవాలకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు పోలీసులు. సెయింట్ జాన్స్, రోటరీ, స్వీకార్ ఉపకార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్, మహబూబీయ కాలేజీలో పార్క్ చేయాలి. కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఝాన్సీమండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హై స్కూల్ ప్రాంగణంలో పార్క్ చేయాలి..రాణిగంజ్, అడవయ్య క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు అడవయ్య మెమోరియల్ హై స్కూల్ ప్రాంగణంలో పార్క్ చేయాలి.మంజు థియేటర్స్ నుంచి వచ్చే వెహికిల్స్ అంజలి థియేటర్స్ లైన్ లో వెహికిల్స్ పార్క్ చేసుకోవాలి.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కు ప 2500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని పోలీసులు కోరుతున్నారు.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.