Shahrukh Khan : 15 ఏళ్లయింది.. నిన్నే చూస్తూనే ఉన్నాను.. దీపికా పదుకొనేకి స్పెషల్ ట్వీట్ చేసిన షారుఖ్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లయింది. 2007లో షారుఖ్ సరసన 'ఓం శాంతి ఓం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దీపికా అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు............

Shahrukh Khan : 15 ఏళ్లయింది.. నిన్నే చూస్తూనే ఉన్నాను.. దీపికా పదుకొనేకి స్పెషల్ ట్వీట్ చేసిన షారుఖ్..

Shahrukh Khan special tweet on Deepika Padukone

Shahrukh Khan :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లయింది. 2007లో షారుఖ్ సరసన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దీపికా అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. దీపికా పదుకొనే ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయిన సందర్భంగా షారుఖ్ ఓ ఫోటో షేర్ చేసి స్పెషల్ ట్వీట్ చేశాడు.

షారుఖ్, దీపికా పదుకొనే కలిసి ఇప్పటికే ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ మూడు సినిమాలు మంచి విజయం సాధించాయి. త్వరలో పఠాన్ సినిమాతో మళ్ళీ వీరిద్దరూ కలిసి ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ నాలుగు సినిమాల్లో షారుఖ్ దీపికా కళ్ళల్లోకి చూసే సన్నివేశాలని ఒక ఫొటోలాగా చేసి ఆ ఫోటోని షేర్ చేశాడు.

Vishal : అభిమానులు చేసిన పనికి ఫిదా అయినా విశాల్.. ఫ్యాన్స్ కి గోల్డ్ చైన్స్ బహుకరణ..

దీపికా, తాను ఉన్న ఫోటోని షేర్ చేసి షారుఖ్ ట్విట్టర్లో… ”అద్భుతమైన 15 సంవత్సరాలు. పట్టుదలతో, నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఇక్కడిదాకా ఎదిగావు. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, నిన్నే చూస్తున్నాను, నీ వైపే చూస్తున్నాను” అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. వీళ్ళిద్దరూ కలిసి చేసిన మూడు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో ఇప్పటికే పఠాన్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో కచ్చితంగా ఈ సినిమా కూడా విజయవంతం అవుతుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.