Corona : కరోనా కాటు.. 50లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం

కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. అనేక కుటుంబాలను అనాథలను చేసింది.

Corona : కరోనా కాటు.. 50లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం

Corona

Corona : కరోనా వైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. అనేక కుటుంబాలను అనాథలను చేసింది. అయిన వాళ్లను దూరం చేసింది. తాజాగా కరోనా మహమ్మారి ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ యువతిని బలి తీసుకుంది.

పెళ్లి చేసుకుని, కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జీవితాన్ని కరోనా వైరస్ చిదిమేసింది. కరోనా మహమ్మారి ఆ యువతి ప్రాణాలు తీసింది. 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందింది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కూతురు నరిష్మరెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. పెళ్లి చేసుకోవడానికి సొంతూరుకు తిరిగొచ్చింది. మే నెలలో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే
అంతలోనే ఆమెకు కరోనా సోకింది.

కరోనాకు చికిత్స తీసుకుని ఆమె కోలుకుంది. అయితే, కరోనా ప్రభావం ఆమె ఊపిరితిత్తులపై పడింది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. 40 రోజులు మృత్యువుతో పోరాడి, చివరకు కన్నుమూసింది. చికిత్స కోసం రూ.50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ప్రాణం దక్కలేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.