Somu Veerraju: ఉద్యోగిపై దాడి ఘటనలో టీటీడీ స్పందించాలి: సోము వీర్రాజు

తిరుమలలో ఒక ఎమ్మెల్యే అనుచరుడు వీరంగం సృష్టించిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు.

Somu Veerraju: ఉద్యోగిపై దాడి ఘటనలో టీటీడీ స్పందించాలి: సోము వీర్రాజు

Somu Veerraju

Somu Veerraju: తిరుమలలో ఒక ఎమ్మెల్యే అనుచరుడు వీరంగం సృష్టించిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. తాజాగా తిరుమలలో ఒక ఎమ్మెల్యే అనుచరుడైన బబ్లూ వీరంగం చేశాడు. తిరుమలలో తనకు గది కావాలంటూ అధికారులపై దాడి చేశాడు. తనను అడ్డదారిలో అనుమతించాలంటూ టీటీడీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. దీనికి అధికారులు అనుమతించకపోవడంతో ఎంబీసీ కౌంటర్ వద్ద టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నంపై దాడి చేశాడు.

Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

తీవ్రగాయాలపాలైన వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగిపై దాడి అంశాన్ని టీటీడీ బోర్డు సీరియస్‌గా తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడికి టీటీడీ అండగా నిలవాలని కోరారు. టీటీడీలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. మరోవైపు ఉద్యోగిపై దాడిని టీటీడీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఖండించింది. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది.