హై ఫ్యాషన్ : వేడుకల్లో వెండి మాస్క్ లు

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 04:05 AM IST
హై ఫ్యాషన్ : వేడుకల్లో వెండి మాస్క్ లు

పెళ్లి జీవితంలో మరిచిపోలేని ఘటన. జీవితకాలం గుర్తుండిపోయేలా ఈ వేడుకను జరుపుకోవాలని పలువురు భావిస్తుంటారు. హంగు, ఆర్బాటాలతో పెళ్లిళ్లు జరుపుకుంటూ..వార్తల్లో నిలుస్తుంటారు. ఎవరి స్థోమత ప్రకారం..వివాహాలు నిర్వహిస్తుంటారు. కానీ..ప్రస్తుతం ఈ సీన్ ఎక్కడా కనిపించడం లేదు.

ఎందుకంటే..కరోనా దెబ్బకు వివాహాలు తాత్కాలికంగా పోస్ట్ పోన్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెళ్లిళ్లు జరిపించుకోవాలంటే..కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, తక్కువ సంఖ్యలో అతిథుల మధ్య పెళ్లి జరిపించుకోవాలని కండీషన్ పెట్టింది. కొంతమంది వివాహాలు నిర్వహిస్తుంటే…మరికొంతమంది వాయిదా వేసుకుంటున్నారు. 

కానీ..ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఖరీదైన పెళ్లిళ్లలో వాడుతున్న మాస్క్ లు హాట్ టాపిక్ అయ్యాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మాస్క్ లు వాడుతున్న సంగతి తెలిసిందే. భౌతికదూరం పాటిస్తూ, మాస్క్, శానిటైజర్లు వాడుతూ వివాహాలు చేసుకుంటున్నారు. కొంచెం ఖరీదైన పెళ్లిళ్లు నిర్వహిస్తున్న వారు..వెండి మాస్క్ లు ధరించి హాజరవతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. 

దీని ధర రూ. 2 వేల 500 రూ. 3 వేల వరకు విక్రయిస్తున్నారంట. కర్నాటక, మహారాష్ట్రాల్లో ఇలాంటి తరహా మాస్క్ లు ధరిస్తున్నారు.