Srikakulam District: హృదయ విదారక ఘటన.. ప్రాణాలకు తెగించి తమ్ముడిని కాపాడిన అక్క!

అక్కకి 13 ఏళ్ళు.. తమ్ముడికి పదేళ్లు. తమ్ముడంటే అక్కకు పంచ ప్రాణాలు.. తమ్ముడడిగితే ఏదీ ఆలోచించకుండా ఇచ్చేసేంత ప్రేమ. అలాంటి అక్కంటే ఆ తమ్ముడుకి ఎనలేని ప్రేమ. వీరి అనుబంధం ఊరిలో అందరికీ ఆశ్చర్యమే.

Srikakulam District: హృదయ విదారక ఘటన.. ప్రాణాలకు తెగించి తమ్ముడిని కాపాడిన అక్క!

Srikakulam District

Srikakulam District: అక్కకి 13 ఏళ్ళు.. తమ్ముడికి పదేళ్లు. తమ్ముడంటే అక్కకు పంచ ప్రాణాలు.. తమ్ముడడిగితే ఏదీ ఆలోచించకుండా ఇచ్చేసేంత ప్రేమ. అలాంటి అక్కంటే ఆ తమ్ముడుకి ఎనలేని ప్రేమ. వీరి అనుబంధం ఊరిలో అందరికీ ఆశ్చర్యమే. పిల్లలుండే ఏ ఇంట్లో అయినా గొడవలు, గిల్లి కజ్జాలు కామన్. కానీ ఈ అక్కాతమ్ముళ్ల అనుబంధానికి నిజమైన ప్రతీకలుగా ఉన్నారు. అందుకే ఊళ్ళో అందరికీ ఈ అక్కా తమ్ముళ్ళంటే ఎంతో అభిమానం. ఇక ఆ తల్లిదండ్రులకు వారి బంగారంలాంటి పిల్లలను చూసుకొని మురిసిపోని రోజు ఉండదు.

కానీ.. అన్నీ సక్రమంగా జరిగితే మనం మనుషులం ఎలా అవుతాం. ఆ అనుబంధానికి ఇచ్చిన సమయం అయిపొయింది అనుకున్నాడేమో దేవుడు అక్కను తనతో తీసుకెళ్లాడు. చావు పోరాటంలో కూడా అక్క తమ్ముడి కోసమే ప్రాణాలు వదిలేసింది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తూరు మండలం ఆకులతంపర గ్రామానికి చెందిన నక్క భాస్కరరావు, సుజాత దంపతులకు 13 ఏళ్ల కుమార్తె ప్రశాంతి, 10 ఏళ్ల కుమారుడు దినేష్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ వంశధార నదిలో నీరు తెచ్చుకొనే రేవు వద్ద స్నానం చేసేందుకు దిగారు.

ఈ సమయంలో అనుకోకుండా దినేష్‌ నదిలో మునిగిపోతుండడాన్ని గమనించిన ప్రశాంతి వెనుకాముందు ఆలోచించకుండా నదిలోకి దూకి అతి కష్టం మీద తమ్ముడిని ఒడ్డుకి చేర్చింది. తన ఆలోచనంతా తమ్ముడ్ని బతికించుకోవడంలో ఉన్న ప్రశాంతి తనకు తెలియకుండానే నీళ్లు తాగేసి అపస్మారక స్థితికి చేరుకొంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రశాంతిని హిరమండలం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఊళ్ళో తిరిగిన అక్క లేకపోవడంతో ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు. చివరికి తమ్ముడి కోసమే ప్రాణాలను వదిలిన ఆ బాలిక సాహసానికి ఆ ఊరే మూగబోయింది.