Congress: కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది: సునీల్ జకార్

కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందని అభిప్రాయపడ్డారు సునీల్ జకార్. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.

Congress: కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది: సునీల్ జకార్

Congress

Congress: కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందని అభిప్రాయపడ్డారు సునీల్ జకార్. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సీనియర్ నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. లోపాల్ని సరిదిద్దుకుని, ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతే త్వరలో ప్రతిపక్ష హోదాను కూడా కాంగ్రెస్ కోల్పోతుంది’’ అని సునీల్ జకార్ అభిప్రాయపడ్డారు.

Janasena: కోనసీమలో చిచ్చుపెట్టింది ప్రభుత్వమే: నాదెండ్ల మనోహర్

ఇటీవల వరుసగా పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీతోపాటు, ఇతర పార్టీల్లో చేరుతున్నారు. శనివారం కూడా కొందరు పంజాబ్ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. వీరిలో పంజాబ్ మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సిద్ధూ, గుర్‌ప్రీత్ సింగ్ కంగర్, సుందర్ షామ్ అరోరా ఉన్నారు. మరికొందరు నేతలు కూడా కేంద్ర మంత్రుల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వాళ్లలో శిరోమణి అకాళీ దళ్ పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారు.