N.V.Ramana: రేపు యాదాద్రి ఆలయానికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్!

తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి రానున్నారు.

N.V.Ramana: రేపు యాదాద్రి ఆలయానికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్!

Supreme Court Chief Justice To Visit Yadadri Temple Tomorrow

N.V.Ramana: తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి రానున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకోనున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉదయం 8.45 నిమిషాల నుండి 9.15 నిమిషాల మధ్య నరసింహస్వామిని దర్శించుకోనున్నారు.

అనంతరం 9.15 గంటల నుండి 9.45 గంటల వరకు పునర్నిర్మాణమైన ఆలయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత 9.45 నిమిషాల నుండి 10 గంటల వరకు వీవీఐపీ గెస్ట్ హౌస్ లో అల్పాహారం తీసుకోనున్న సీజేఐ 10 గంటలకు యాదాద్రి ఆలయం నుండి తిరుగు పయనం కానున్నారు.