ఎందుకింత కాంట్రవర్సీ చేస్తున్నారు.. బాలయ్య, నాగబాబు వ్యాఖ్యలపై తమ్మారెడ్డి ఫైర్

  • Published By: srihari ,Published On : May 30, 2020 / 07:52 AM IST
ఎందుకింత కాంట్రవర్సీ చేస్తున్నారు.. బాలయ్య, నాగబాబు వ్యాఖ్యలపై తమ్మారెడ్డి ఫైర్

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు సమావేశం కావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్లు వేయడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాని ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

గతంలో దాసరి ఇంట్లో చాలా సమావేశాలు జరిగాయని చెప్పారు. అప్పట్లో ఎవరూ దీనిపై మాట్లాడలేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. సినీ ఇండస్ట్రీ కోసమే చిరంజీవి ఇంట్లో సమావేశం నిర్వహించామన్నారు. ఇండస్ట్రీ మంచి కోసం ఎవరితో అయినా కలిసి నడుస్తామని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి తమ్మారెడ్డి భరద్వాజ్, ఎన్ శంర్, సి.కళ్యాణ్, బెనర్జీ హాజరయ్యారు. చిరంజీవి ఇంట్లో సీసీసీ రివ్యూ మీటింగ్ జరిగిందని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు.

బాలకృష్ణను పిలవకపోవడం ఏమి లేదని ప్రొడ్యూసర్స్ లీడ్ తీసుకుని మీటింగ్స్ జరిగాయని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు యూట్యూబ్ చానెల్లో మండిపడ్డారు. భూములు పంచుకుంటున్నారా అన్న బాలయ్య వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నాగబాబు సూచించారు. బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీకి టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

Read:బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం : తమ్మారెడ్డి భరద్వాజ