Updated On - 11:12 am, Thu, 4 March 21
tdp ex mp son suicide attempt: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం రాంజీ పరిస్థితి విషమంగా ఉంది. చావుతో పోరాడుతున్నాడు. గత రాత్రి రాంజీ నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ తెల్లవారుజామున రాంజీని చూసిన కుటుంబీకులు, అతన్ని వెంటనే ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా, కార్డియాక్ అరెస్టు కావడంతో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై రాంజీకి చికిత్స అందిస్తున్నారు. రాంజీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. కాగా, రాంజీ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.
మాగంటి రాంజీ టీడీపీలో యువనేతగా ఉన్నారు. కాగా, గతంలో రాంజీపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. వరసకు వదిన అయ్యే మహిళకు అసభ్యకరమైన మెసేజ్ లను పంపించాడన్న కేసు విషయంలో విచారణ కొనసాగుతోంది. తనకు జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి కావాలని కూడా రాంజీ గతంలో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.
దీనిపై రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యాయత్నం కాదు.. రాంజీకి గుండెపోటు రావడంతోనే ఆస్పత్రికి తరలించారని కొందరు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది రాంజీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మాగంటి బాబు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీ నుంచి ఏలూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
Tirupati by election: రేపే ఎన్నికలు.. తిరుపతిలో ఎవరి లెక్క ఏంటీ?
Ugadi Panchangam 2021 : జగన్, కేసీఆర్ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు భవిష్యత్తు ఏంటి?
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
Minister Kodali Nani: భయపడి పారిపోయి.. ఎన్నికలను అడ్డుకుంటున్నారు
Ambati Rambabu: రాష్ట్రంలో ఇక టీడీపీ శకం ముగిసినట్లే
TDP Bycot : ఎస్ఈసీని తప్పుబడుతూ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ